ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణంలో సీనియర్ ఐఏఎస్ అధికారి,హోంశాఖ ముఖ్యకార్యదర్శి బిపి ఆచార్యని సిబిఐ అధికారులు అరెస్ట్ చేసిన నేపధ్యంలో కొందరు అధికారుల గుండెల్లో రైళ్లు పరుగుడెతున్నాయి. ఎమ్మార్ లో అక్రమాలు పుట్టపగిలినా ఆచార్య గుడ్లప్పగించి చూస్తూ ఊరుకున్నారనీ, దీంతో ప్రభుత్వ బొక్కసానికి కోట్ల రూపాయల గండి పడిందని సీబీఐ అభియోగం.